(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్(నమస్తే తెలంగాణ): బీజేపీ ఘోర పరాజయానికి లింగాయత్ వర్గం ఆగ్రహం కూడా కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతంగా ఉన్న లింగాయత్లు తమ వర్గం నాయకుడు యెడియూరప్పను బీజేపీ జాతీయ అధిష్ఠానం అవమానకరంగా సీఎం సీట్లో నుంచి తప్పించడాన్ని అవమానంగా భావించారు. గ్రహించిన బీజేపీ నాయకత్వం ఎన్నికలకు ముందు లింగాయతులను బుజ్జగించడానికి ఓబీసీ కోటాలోని ముస్లింల రిజర్వేషన్లను తొలగించి అందులో 2 శాతం వీరికి కల్పించింది. అయితే సుప్రీం కోర్టు నిలుపుదల చేయడంతో ఫలితం లేకుండా పోయింది. లింగాయత్ వర్గానికి చెందిన 500 మఠాలకు నిధులు మంజూరు చేయడానికి 40 శాతం కమీషన్లు పుచ్చుకుందని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ లింగాయత్ వర్గాన్ని బీజేపీకి దూరం చేశాయి.