బెంగళూరు: బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన రేవ్పార్టీపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ సర్కారుపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం సిలికాన్ సిటీని ఉడ్తాబెంగళూర్గా మార్చిందని దుయ్యబట్టింది. రేవ్పార్టీలు, డ్రగ్స్కు నగరాన్ని ఆడ్డాగా మార్చిందని విరుచుకుపడింది.
‘కాంగ్రెస్ సర్కారు వచ్చాక నగరంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. సిలికాన్ నగరం.. రేవ్పార్టీలు, డ్రగ్స్కు అడ్డాగా మారింది’ అని ఎక్స్ ఖాతాలో బీజేపీ పోస్ట్ చేసింది. పంజాబ్లో డ్రగ్స్ వినియోగాన్ని ఎత్తిచూపుతూ ఉడ్తా పంజాబ్ పేరిట బాలీవుడ్లో ఓ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.