న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఆంక్షలను మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, మిగతా షరతుల్లో ఎలాంటి మార్పు లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) బుధవారం జారీచేసిన ఓ నోటిఫికేషన్లో పేర్కొన్నది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో చక్కెర నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.