న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ నేతలు సోమవారం ధర్నాకు దిగారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే అవకాశం ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.
జనవరి 6న కార్పొరేషన్ తొలి సమావేశం జరగగా రెండు పార్టీల సభ్యుల గొడవతో మేయర్ ఎన్నిక జరగకుండానే సభ వాయిదా పడింది. బీజేపీకి మేయర్ పదవిని దక్కించుకునే మెజారిటీ లేకపోయినా అభ్యర్థిని పోటీకి నిలిపిన సంగతి తెలిసిందే.