ఛైబాస, ఆగస్టు 11: దొంగనోట్ల చెలామణి కేసులో జార్ఖండ్కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే పుత్కర్ హెంబ్రోమ్ భార్య మలయ హెంబ్రోమ్కు స్థానిక కోర్టు నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది.
పుత్కర్ రెండో భార్య అయిన మలయ 2020లో ఓ దుకాణంలో రూ.2 వేల నోటు ఇచ్చి వస్తువులు కొన్నారు. తర్వాత ఆ నోటు నకిలీదని తేలింది. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలయను విచారించగా తాను ఢిల్లీలో ఒక్కో నోటుకు రూ.500 ఇచ్చి తీసుకున్నానని, వాటిని చెలామణి చేయడానికి ప్రయత్నించానని ఒప్పుకున్నారు.