న్యూఢిల్లీ, మార్చి 4: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి నడ్డా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనున్నది. ఈ లోగా గుజరాత్ నుంచి మరోసారి రాజ్యసభకు నడ్డా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ తరఫున ఎంపికైన స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.