మహారాష్ట్ర ;బడా కార్పొరేట్ వ్యాపారవేత్తలకు ప్రజాధనం దోచిపెడుతున్న బీజేపీ సర్కారు.. చిరు వ్యాపారులపై మాత్రం జులుం ప్రదర్శిస్తున్నది. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ముంబైలోని మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ) వీధి వ్యాపారులపై బుల్డోజరిజం చేసింది. ఫుట్పాత్ను ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటారనే సాకుతో తోపుడు బండ్లను జేసీబీతో తొక్కించింది. మీరారోడ్డులోని బనేగర్ రోడ్డులో చిరు వ్యాపారులకు చెందిన 80కిపైగా తోపుడుబండ్లను ధ్వంసం చేయించింది.