Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్కు నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను కాషాయ పార్టీ వేగవంతం చేసింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నాలుగో జాబితాను బీజేపీ శుక్రవారం విడుదల చేసింది.
ఈ జాబితాలో తమిళనాడులోని 14 లోక్సభ స్ధానాలతో పాటు పుదుచ్చేరిలో ఓ స్ధానానికి అభ్యర్ధులను బీజేపీ వెల్లడించింది. విరుద్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి నటి రాధికా శరత్కుమార్ను బరిలో దింపింది. ఇక తొలివిడతలో 195 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన బీజేపీ మలి విడత జాబితాలో 72 మంది అభ్యర్ధులను వెల్లడించింది.
తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ దిగ్గజ నేతలకు చోటు దక్కింది. మరోవైపు మూడో జాబితాలో కేవలం తమిళనాడు నుంచి పోటీ చేసే 9 మంది అభ్యర్ధులను ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సైకి చోటు కల్పించింది. ఆమె చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు.
Read More :
MLA Kunamneni | త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు!