బెంగళూరు, సెప్టెంబర్ 8: వచ్చి ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో కలిసి పోటీ చేయాలని బీజేపీ-జేడీ(ఎస్) అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని బీజేపీ మాజీ సీఎం యడియూరప్ప శుక్రవారం వెల్లడించారు.
కాగా జేడీ(ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత ఈ పొత్తు ఖరారైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 28 ఎంపీ సీట్లలో నాలుగింటిలో జేడీఎస్, మిగిలిన వాటిలో బీజేపీ పోటీ చేయాలని ఒప్పందం కుదిరినట్టు తెలుస్తున్నది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని హెచ్డీ దేవెగౌడ ప్రకటించి రెండు నెలలు కూడా కాకముందే ఇరుపార్టీల మధ్య ఒప్పందం కుదరడం గమనార్హం.