ISRO : తమిళనాడులో నూతన ఇస్రో స్పేస్పోర్ట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో చైనా జెండాతో కూడిన రాకెట్ను ప్రదర్శించడం వివాదాలకు కేంద్ర బిందువైంది. కులశేఖరపట్నంలో ఇస్రో స్పేస్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ ఈ ప్రకటనను జారీ చేశారని చెబుతున్నారు.
కానీ ఈ ప్రకటనలో రాకెట్పై చైనా జెండా ప్రచురితమవడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం లక్ష్యంగా బీజేపీ విమర్శలు గుప్పించింది. స్ధానిక దినపత్రికల్లో జారీ చేసిన ఈ ప్రకటనను బీజేపీ రాష్ట్ర చీఫ్ కే. అన్నామలై ఖండించారు. దేశ సార్వభౌమత్వాన్ని డీఎంకే అగౌరవపరుస్తోందని మండిపడ్డారు.
ఇస్రో తొలి లాంఛ్ ప్యాడ్ సిద్ధమైనప్పుడు ఇస్రో తొలి ఎంపిక తమళనాడేనని అన్నామలై గుర్తుచేశారు. కానీ ఈ విషయంలో డీఎంకే వ్యవహరించిన తీరు నిరాశపరిచిందని చెప్పారు. అప్పటి సిఎం తిరు అన్నాదురై ప్రతినిధి తాగిన మత్తులో రావడం మన దేశ అంతరిక్ష కార్యక్రమం పట్ల డీఎంకే చిత్తశుద్ధిని తేటతెల్లం చేశాయని అన్నారు. డీఎంకే తీరు ఏమాత్రం మారలేదని, మరింత దిగజారిందని అన్నామలై ఆక్షేపించారు.
Read More :