న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలు చలితో వణికిపోతున్నాయి. హిమాలయాల నుంచి వస్తున్న శీతల గాలుల వల్ల .. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈశాన్య ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు మూడు నుంచి అయిదు డిగ్రీలకు పడిపోయాయి. రానున్న అయిదు రోజుల పాటు ఢిల్లీలో దట్టమైన పొగ మంచు కప్పుకోనున్నది. జనవరి ఒకటో తేదీ నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ ఉంటుందని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలీ, చనబా, కుఫ్రి, నార్కండ లాంటి ప్రాంతాల్లో మళ్లీ మంచు కురుస్తోంది. మరికొన్ని రోజుల పాటు కూడా మంచు పడే అవకాశం ఉన్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది.