Bird Flu In Kerala | కేరళలోని కొట్టాయంలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. రెండు ప్రాంతాల్లో హెచ్5ఎన్1 వైరస్ ప్రబలుతుందని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని కొట్టాయం వెటర్నరీ చీఫ్ తెలిపారు. క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, త్వరలోనే ఫౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
బర్డ్ఫ్లూను ఏవియన్ ఇన్ల్ఫుఎంజా అని కూడా పిలుస్తుంటారు. పక్షుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ పక్షులకు ప్రాణాంతకంగా మారుతుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జనవరిలో హెచ్5ఎన్1 (బర్డ్ ఫ్లూ జాతి) వైరస్ కారణంగా ఇద్దరు మరణించగా.. 13 మందికి వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు. ఐక్యరాజ్యసమితి సంస్థ టర్కీలో బర్డ్ ఫ్లూ వ్యాధి అంటువ్యాధిగా రూపాంతరం చెందిందని, పొరుగుదేశాలకు సైతం విస్తరించే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. మరో వైపు బర్డ్ఫ్లూలో దాదాపు 15-16 రకాల జాతులున్నాయి.
వీటిలో H5N1, H5N8, H7N3, H7N7, H7N9, H9N2 ఉండగా.. H7N9, H7N7తో పాటు H9N2 రకాలు అరుదుగా మనుషులకు సోకుతున్నా.. H5N1 వేరియంట్ ఎక్కువగా సోకుతున్నట్లు గుర్తించారు. ఈ వైరస్ ప్రమాదకరమైందని నిపుణులు పేర్కొన్నారు. ఢిల్లీలో H5N8 స్ట్రెయిన్ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. దేశంలో తొలిసారిగా 2016లో బర్డ్ఫ్లూ తొలి కేసు నమోదైంది. మహారాష్ట్రలోని ఓ కోళ్ల ఫామ్లో వైరస్ను గుర్తించడం ఇదే తొలిసారి. అప్పటి నుంచి దాదాపు ప్రతి ఏటా బర్డ్ఫ్లూ కేసులు పలు రాష్ట్రాల్లో నమోదవుతూ వస్తున్నాయి.