కొట్టాయం (కేరళ), డిసెంబర్ 25: కేరళలో బర్డ్ఫ్లూ విజృంభిస్తున్నది. కొట్టాయం పరిధిలోని మూడు గ్రామ పంచాయతీల్లో ఒక్కరోజే సుమారు ఆరువేల బాతులు, కోళ్లను చంపివేశారు. వేచూరు, నీండూర్ తదితర పంచాయతీల్లో వ్యాధి తీవ్రంగా ఉందని అధికార యంత్రాంగం చెబుతున్నది.
కేరళలో బర్డ్ఫ్లూ ఉద్ధృతి నేపథ్యంలో ప్రధాన దీవులకు ఫ్రోజెన్ చికెన్ రవాణాను నిలిపివేసినట్లు లక్షద్వీప్ యంత్రాంగం పేర్కొంది.