బెంగళూరు: ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సులోకి ఎక్కి డ్రైవర్పై చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగక డ్రైవర్ను కిందకు లాగి కొట్టాడు (Biker assaults Bus driver). దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మైసూర్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 10న ఒక వ్యక్తి బైక్పై జీఎన్ రోడ్డులో వెళ్తున్నాడు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన బస్సు తన బైక్కు తగిలినట్లు ఆరోపించాడు. దీనిపై బస్సు డ్రైవర్తో ఘర్షణకు దిగాడు. వాగ్వాదం పెరుగడంతో ఆగ్రహించిన అతడు బస్సులోకి దూసుకెళ్లాడు. డ్రైవర్ చొక్కా కాలర్ పట్టుకుని దాడి చేశాడు. అనంతరం డ్రైవర్ను కిందకు లాగాడు. డ్రైవర్తోపాటు బస్సు కండక్టర్ను కూడా కొట్టాడు. ఇంతలో రోడ్డుపై ఉన్న వ్యక్తులు జోక్యం చేసుకున్నారు. పొట్లాడుకుంటున్న వారిని దూరం చేశారు.
కాగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ సర్వెంట్లపై దాడి చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన మైసూరుకు చెందిన 30 ఏండ్ల షారుఖ్ను అరెస్ట్ చేశారు. మరోవైపు కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.