శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. నిన్న కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్ను కాల్చి చంపిన ముష్కరులు.. మరో దారుణానికి పాల్పడ్డారు. బుద్గాం జిల్లాలో బీహార్కు చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు గురువారం రాత్రి కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరపగా, ఒకరు మృతి చెందారు. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుడిని దిల్ఖుష్ కుమార్(17)గా పోలీసులు గుర్తించారు. వలస కార్మికులిద్దరూ చడోరా గ్రామంలో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల్లో పని చేస్తు జీవనోపాధి పొందుతున్నారు. కార్మికులపై కాల్పులు జరిపిన ఏరియాలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు.