పాట్నా, జూన్ 27: సందడిగా సాగుతున్న పెండ్లి వేడుకలో విద్యుత్తు షాక్ విషాదం నింపింది. మైక్ పట్టుకొని ఉత్సాహంగా పాట పాడుతున్న ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. బీహార్లోని మబ్బీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం గ్రామంలో పెండ్లి వేడుక జరుగుతుండగా మీనా దేవి అనే మహిళ మైక్రో ఫోన్ పట్టుకొని పాడటం మొదలు పెట్టింది. కాసేపటికే హఠాత్తుగా మైక్రో ఫోన్ పని చేయడం ఆగిపోయింది. మైక్ ద్వారా కరెంట్ ఆమె ఒంట్లోకి ప్రవేశించి ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మైక్రో ఫోన్కు విద్యుత్తు ప్రసారంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.