పాట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు ప్రమాణం
చేసిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రస్తుతం తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జేడీ మంత్రులకు ఆరు మార్గదర్శకాలను జారీ చేశారు. సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. మంత్రులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడం, పనిలో నిజాయితీ, పారద్శకత తదితర సూచనలు చేశారు. నితీశ్కుమార్ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ కోటా మంత్రులు ఆయా శాఖల్లో తమకు ఎలాంటి వాహనాలను కొనుగోలు చేయొద్దన్నారు. అలాగే మంత్రులు తమకంటే పెద్దవారిని తమ పాదాలను తాగనివ్వొద్దని, మర్యాద కోసం చేతితో నమస్కారం చేయాలన్నారు.
మంత్రులందరు అందరితో మర్యాదపూర్వకంగా ఉండాలని, అన్ని కులమతాలకు చెందిన పేదలకు ప్రాధాన్యత ఇస్తూ సహాయం చేయాలన్నారు. అదే విధంగా పువ్వులు బొకేలకు బదులుగా బుక్, పెన్ ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తామన్నారు. అన్నిశాఖల పనుల్లో ముఖ్యమంత్రి నాయకత్వంలో నిజాయితీ, పారదర్శకత, సత్వరం అమలును ప్రోత్సహిస్తామన్నారు. మంత్రులతు బిహార్ ప్రభుత్వం, ఆయా విభాగాలు, పని ప్రణాళికను అభివృద్ధి పనులను సోషల్ మీడియాలో నిరంతరం ప్రచారం చేస్తారన్నారు. సమస్యల పరిష్కారానికి మహాకూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తేజస్వీ పేర్కొన్నారు.