పాట్నా: బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆదివారం నోరు జారారు. ప్రధాని మోదీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో ఈసారి 400కుపైగా స్థానాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నాం.
మోదీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నాం. దేశం, బీహార్ అభివృద్ధి చెందాలి’ అని నితీశ్ కుమార్ అన్నారు.