పాట్నా, ఏప్రిల్ 29: కర్ణాటక ఎన్నికల తర్వాత పాట్నాలో విపక్ష పార్టీల నేతల సమావేశం జరిగే అవకాశం ఉన్నదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ శనివారం అన్నారు. విపక్షాల ఐక్యతపై చర్చిస్తామన్నారు. ‘2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటుకు సంబంధించిన అంశంపై మేము కచ్చితంగా కలిసి కూర్చొని చర్చిస్తాం.
ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొందరు నేతలు బిజీగా ఉన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత వేదికను ఖరారు చేస్తాం. విపక్ష నేతలు తదుపరి సమావేశం వేదికను పాట్నాగా ఏక్రగీవంగా నిర్ణయిస్తే ఇక్కడే సంతోషంగా నిర్వహిస్తాం’ అని అన్నారు.