పాట్నా: బీహార్లో కుల గణన(Caste Census) రెండో దశ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా కుల గణన చేపడుతున్నారు. ఇంటి ఇంటికి తిరిగి అధికారులు సర్వే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్(CM Nitish Kumar) ఇంటికి కూడా అధికారులు వెళ్లారు. సెన్సెస్లో భాగంగా సీఎం నితీశ్ .. కుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. పాట్నా జిల్లాలోని భక్తియార్పూర్ ఇంట్లో నితీశ్ నుంచి అధికారులు సమాచారాన్ని సేకరించారని ఎస్డీఎం కుందన్ కుమార్ తెలిపారు.
#WATCH | Caste-based census is extremely beneficial if it is done in all states of the country. People will get to know about this very soon and we will raise awareness among them. We have instructed the officials to carry out the census without errors: Bihar CM Nitish Kumar pic.twitter.com/wOd4cM5DZO
— ANI (@ANI) April 15, 2023
కుల గణనలో భాగంగా బీహార్ అధికారులు మొత్తం 17 ప్రశ్నలు అడగనున్నారు. అయితే కుటుంసభ్యులతో కలిసి సీఎం నితీశ్ సెన్సెస్లో పాల్గొంటారు. అన్ని ప్రశ్నలకు జవాబు ఇచ్చిన తర్వాత ఆ పత్రంపై ఆయన సంతకం తీసుకుంటారు. మే 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జాతి గణన చేపట్టనున్నారు. కుల సమాచారాన్ని మొత్తం యాప్లో పొందపరచనున్నారు.
అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేపడితే బాగుంటుందని నితీశ్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తామని, దీని పట్ల చైతన్య కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఎటువంటి తప్పులు లేకుండా సర్వే కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు నితీశ్ వెల్లడించారు.