పాట్నా: సివిల్ సర్వీస్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్ష సాధారణీకరణను వ్యతిరేకించారు. ఈ పరీక్షలో మార్పులు చేయవద్దని, పాతపద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. (Police Lathi Charge) బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సివిల్ సర్వీస్ అభ్యర్థులు నిరసనకు దిగారు. బెయిలీ రోడ్లోని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) ఎదుట ఆందోళన చేపట్టారు. 70వ కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్షను నార్మలైజ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే పరీక్షా విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిరసనకు దిగిన సివిల్ సర్వీస్ ఔత్సాహిక అభ్యర్థులను చెదరగొట్టారు.
మరోవైపు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) దీనిపై స్పందించింది. నార్మలైజేషన్ కోసం కమిషన్ ఎలాంటి ప్రణాళిక ప్రకటించలేదని కార్యదర్శి స్పష్టం చేశారు. దీని గురించి వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. అభ్యర్థులు ఆందోళన వీడి ప్రిపరేషన్పై దృష్టిసారించాలని సూచించారు.