పాట్నా, నవంబర్ 9: ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ కులాలకు ప్రస్తుతం కల్పిస్తున్న 50 శాతం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు బీహార్ శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వీటికి ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతం కలిపితే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి పెరుగుతాయి. కొత్త బిల్లు ప్రకారం ఎస్టీల కోటా ఒక శాతం నుంచి రెండు శాతానికి, ఎస్సీల కోటా 16 నుంచి 20 శాతానికి పెరగనుంది.
ఈబీసీల కోటా 18 నుంచి 25 శాతానికి, ఓబీసీల కోటా 12 నుంచి 15 శాతానికి పెరగనుంది. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచారు. ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీశ్కుమార్ మాట్లాడుతూ కేంద్రం కూడా కుల గణనకు అంగీకరించి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లను పెంచితే తాను సంతోషిస్తానన్నారు. తమ రాష్ర్టానికి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.