వరంగల్ అర్బన్ : వరంగల్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఈ నెల 21 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఆదివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ ఏర్పాట్లను పరిశీలించారు. నూతన కలక్టరేట్ భవన పరిశీలన అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరంగల్ అర్బన్లో సూపర్ స్పేషాలిటి ఆస్పత్రికి భూమి పూజ, కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయంకు సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్కి జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పొచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, జిల్లా పరిషత్ చేర్మెన్ సుధీర్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మేయర్ గుండు సుధారాణి, చైర్మన్ డాక్టర్ కె వాసుదేవ రెడ్డి, డి.ఆర్. ఓ. వాసుచంద్ర, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.