(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): అభివృద్ధికి గుజరాత్ మాడల్ ఆదర్శమంటూ ఊదరగొట్టే బీజేపీ ప్రభుత్వానికి అక్కడ పోషకాహార లోపంతో చనిపోతున్న పిల్లలు మాత్రం కనిపించటం లేదు. జూన్ 7-15 మధ్యన లుడ్బాయి గ్రామంలో పోషకాహార లోపంతో ఐదుగురు నవజాత శిశువులు మరణించారు.
పోషకాహార లోపాలను గుర్తించాలని గ్రామస్థులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. చివరికి ప్రైవేటు వ్యక్తుల సాయంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తే 39 మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. మరోవైపు గర్భిణులు, నవజాత శిశువులలో రక్తహీనతను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నది.