బెంగళూరు : నిత్యం పోర్న్ సైట్స్ చూస్తూ.. భర్త భార్యను పట్టించుకోవడం లేదు. ఆ వీడియోలు చూడొద్దని చెప్పినందుకు భార్యను వేధింపులకు గురి చేస్తూ హింసించాడు. భర్త తల్లిదండ్రులు కూడా అతనికే మద్దతు తెలుపడంతో.. బాధిత మహిళ కోర్టు మెట్లు ఎక్కి.. తనకు న్యాయం చేయాలని కోరింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని జయనగర్కు చెందిన ఓ మహిళ(36)కు 2019లో వివాహమైంది. అయితే గత కొద్ది కాలం నుంచి ఆమె భర్త పోర్న్ సైట్స్ చూస్తున్నాడు. ఇక ఆమెను పట్టించుకోవడం లేదు. అంతేకాదు.. రాత్రి సమయాల్లో కాల్ గర్ల్స్కు ఫోన్ చేసి ఎంజాయ్ చేస్తున్నాడు. అంతటితో ఆగలేదు ఆయన.. ఓ మ్యాట్రిమోని వెబ్సైట్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. తనకు భార్య విడాకులు ఇచ్చిందని ఆ వివరాల్లో పేర్కొన్నాడు. ఈ ఆగడాలు భరించలేని భార్య.. ఆ వీడియోలు చూడొద్దని వారించింది. దీంతో ఆమెను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు.
ఈ విషయాన్ని భార్య తన అత్తమామల దృష్టికి తీసుకెళ్తే.. వారు కూడా కుమారుడికే మద్దతు ఇచ్చారు. పాడైన ఆహారం పెట్టి వేధించారు. ఇంటికే పరిమితం చేసి హింసించారు. ఇక చేసేదేమీ లేక.. బాధిత మహిళ ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు.. భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.