Bengaluru | బెంగళూరు : రోజుకు రూ.5 వేలు ఇస్తేనే తనతో కాపురం చేస్తానని తన భార్య అంటోందని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నదని, తనను ఉద్యోగం చేసుకోనివ్వకుండా వేధిస్తున్నదని బాధితుడు వెల్లడించాడు. ఒకవేళ విడాకులు ఇవ్వాలనుకొంటే రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నదని తెలిపాడు.
పిల్లలను కనడానికి తన భార్య తిరస్కరిస్తున్నదని తెలిపారు. తాను ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు పెద్దగా సంగీతం పెట్టి నృత్యం చేయడంతో ఉద్యోగం పోయిందని వాపోయాడు. అయితే శ్రీనివాస్ ఆరోపణలను బిందు ఖండించారు. తాను విడాకుల కోసం డబ్బు డిమాండ్ చేయలేదని తన భర్తే తనను అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది.