Cyber Fraud | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: బెంగళూరులో భారీ సైబర్ దోపిడి బయటపడింది. ఓ పెట్టుబడి పథకంపై లాభాల్ని ఆశచూపిన సైబర్ నేరస్థులు దేశవ్యాప్తంగా వేలాది మందికి చెందిన రూ.854 కోట్లను దోచుకున్నారు. ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశామని, రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద శనివారం తెలిపారు.
నిందితులు మనోజ్, పనీంద్ర, చక్రధర్, శ్రీనివాస్, సోమశేఖర్, వసంత్ బెంగుళూరు వాసులేనని చెప్పారు. బెంగళూర్కు చెందిన ఓ వ్యక్తి రూ.49 లక్షలు మోసపోయాడని తెలిపారు. ‘రోజుకు రూ.5 వేల వరకు లాభాలు వస్తాయని వాట్సా ప్, టెలిగ్రామ్ల ద్వారా బాధితుల నుంచి సైబర్గ్యాంగ్ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. లక్ష నుంచి రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టినవారు దేశవ్యాప్తంగా వేలల్లో ఉన్నారు’ అని బీ దయానంద చెప్పారు.