బెంగళూరు: బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లు గుంతలమయంగా మారాయి. దీంతో నిత్యం వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారుల గోతుల్లో వాహనాలు పడటంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెలలో ఇద్దరు ముగ్గురు మరణించగా పలువురు గాయపడ్డారు. తాజాగా గత శుక్రవారం ఒక మార్గంలోని రహదారి గోతిలో పడి ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఎలక్ట్రిక్ స్కూటర్పై వెళ్తున్న ఒక వ్యక్తి ఉల్సూర్లోని ఓల్డ్ మద్రాస్ రోడ్లో ఆదర్శ థియేటర్ ఎదురుగా రోడ్డుపై ఉన్న గుంతలో పడి గాయపడ్డాడు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ వ్యక్తి అక్కడే బైఠాయించి నిరసనకు దిగాడు. తనకు అయిన గాయాలకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, బృహన్ బెంగళూరు కార్పొరేషన్ (బీఎంసీ) బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు.
కాగా, ‘స్పీక్ అప్ బెంగళూరు’ అనే సంస్థ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘బెంగుళూరు ప్రజలు ప్రతిరోజూ తమ జీవితాలతో పోరాడుతున్నారు. సీవీ రామన్ నగర్ ఎమ్మెల్యే రఘుకి ధన్యవాదాలు’ అని ఎద్దేవా చేసింది.
అలాగే కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై ఆ గ్రూప్ మండిపడింది. నగరంలోని రహదారులపై ఉన్న గుంతల సమస్యలను మూడు సందర్భాల్లో మాత్రమే బెంగళూరు అథారిటీ పరిష్కరిస్తుంది. అవి 1. ప్రధాని నరేంద్ర మోదీ నగరాన్ని సందర్శించినప్పుడు, 2. గుంతల కారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు, 3. గాయపడిన వ్యక్తి నిరసన తెలిపినప్పుడు అని ఆ ట్వీట్లో విమర్శించింది.
They filled it in the first half, which means @mla_raghu and CM @BSBommai’s #Potholes will be fixed in 3 cases.
1. When PM @narendramodi comes.
2. When someone Dies.
3. When somebody injured and only if injured protest.#SpeakUpBengaluru pic.twitter.com/WAikW1Wmls— ಮಾತಾಡ್ ಮಾತಾಡ್ ಬೆಂಗಳೂರು – #SpeakUpBengaluru (@SpeakUpBengalur) November 11, 2022