బెంగళూరు: మహిళతో శృంగారం చేస్తూ గుండెపోటుతో ఒక వ్యాపారి మరణించాడు. దీంతో భయపడిన ఆమె తన భర్త, సోదరుడి సహాయంతో అతడి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 17న జేపీ నగర్ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉన్న ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు మృతుడ్ని బిజినెస్ మ్యాన్ అయిన 67 ఏళ్ల బాలసుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ఆయన మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఆ వ్యాపారి ఇంట్లో పని చేసే 35 ఏళ్ల మహిళతో ఆయనకు సంబంధం ఉందని, ఆమె ఇంటికి తరచుగా వెళ్లేవాడని గుర్తించారు.
కాగా, బుధవారం సాయంత్రం ఆ మహిళ ఇంటికి వెళ్లిన వ్యాపారి బాలసుబ్రహ్మణ్యం ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. దీంతో భయపడిన ఆ మహిళ తన భర్త, సోదరుడి సహాయంతో అతడి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి జేపీ నగర్లో పడేసింది.
మరోవైపు వ్యాపారి మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడి మొబైల్ ఫోన్లోని కాల్స్ ఆధారంగా అతడి ఇంట్లో పని చేసే మహిళ ఇంటికి ఆయన వెళ్లినట్లు గ్రహించారు. దీంతో ఆమెను ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ మహిళతోపాటు ఆమెకు సహకరించిన భర్త, సోదరుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, వ్యాపారి బాలసుబ్రహ్మణ్యంకు ఇటీవల యాంజియోగ్రామ్ జరిగిందని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఒక పని ఉందంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదని చెప్పారు.