అహ్మదాబాద్: బెంగాలీలను కించపరిచేలా బీజేపీ ఎంపీ, నటుడు పరేశ్ రావల్ గుజరాత్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో పరేశ్ రావల్ మాట్లాడారు. ‘గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కొన్ని రోజులుపోతే సిలిండర్ ధరలు తగ్గుతాయి. ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ, ఢిల్లీ తరహాలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు మీ చుట్టూ చేరితే మీరేం చేస్తారు? బెంగాలీలకు మీరు చేపలు వండిపెడతారా?’ అని ప్రశ్నించారు.
అయితే, పరేశ్ వ్యాఖ్యలు బెంగాలీలను అవమానించేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పరేశ్ రావల్ స్పందించారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు.