కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని హౌరాలో శ్రీరామ నవమి వేడుకల్లో తలెత్తిన ఘర్షణలపై సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee ) స్పందించారు. నెలరోజులుగా అల్లర్లకు బీజేపీ ప్రణాళికలు రూపొందించిందని దీదీ ఆరోపించారు. అదానీ ఉదంతంపై విపక్షాల ప్రశ్నల దాడిని తప్పించుకునేందుకు కాషాయ పార్టీ అల్లర్ల కుట్రకు తెరలేపిందని ఆమె పేర్కొన్నారు.
బెంగాల్కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తూ తాను నిరసనల్లో నిమగ్నమయ్యాయనని, అయితే రామనవమి వేడుకల్లో హింసకు తెగబడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని దీదీ స్పష్టం చేశారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరిస్తూ సంయమనం పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. హింసను ముందుగా ఎవరు ప్రేరేపించారనేది ప్రజలకు తెలుసునని అన్నారు. గన్స్, పెట్రోల్ బాంబులను కలిగిఉన్న అల్లరి మూకను బీజేపీ రంగంలోకి దింపిందని దీదీ ఆరోపించారు.
వీరంతా ముందుగా మైనారిటీ వర్గాలపై దాడులకు తెగబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 31 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. బెంగాల్లోని హౌరా జిల్లాలో రామనవమి వేడుకల సందర్భంగా ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో అల్లరి మూకలు పలు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు దుకాణాలను లూటీ చేశాయి. ఈ ఘటనకు సంబంధించి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read More
Toll tax | రేపటి నుంచి టోల్ బాదుడు షురూ.. సగటున 4 నుంచి 4.5 శాతం పెంపుదల