న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జీల నియామకం కోసం అనుసరిస్తున్న కొలీజియం విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ సోమవారం చెప్పారు. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలని లాయర్ మాథ్యూస్ జే నెడుంపర సుప్రీంకోర్టును కోరినపుడు సీజేఐ స్పందిస్తూ, ‘ధర్మాసనాన్ని ఏర్పాటు చేయవలసి ఉంది’ అన్నారు.