పట్నా : బిహార్లోని భాగల్పూర్లో నాలుగు నెలల కిందట మరణించిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ఉండగా తాజాగా సదరు వ్యక్తి నోయిడాలో మోమోస్ తింటూ కనిపించాడు. 2023 జనవరి 31న నిషాంత్ కుమార్ కనిపించకుండా పోవడంతో అతడి బావమరింది రవి శంకర్ సింగ్, మామ నవీన్ సింగ్ నిషాంత్ను కిడ్నాప్ చేశారని తండ్రి సచ్చిదానంద్ సింగ్ సుల్తాన్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
నోయిడాలోని ఓ మోమోస్ షాపులో రవి ఉండగా ఓ దుకాణదారు మురికి దుస్తులు ధరించిన ఓ వ్యక్తిని తిట్టడం చూశాడు. ఆపై అతడు నిషాంత్ అని గుర్తించిన రవి అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లగా వారు బిహార్ పోలీసులకు అప్పగించారు. నిషాంత్ను కోర్టులో హాజరు పరిచారు. నిషాంత్ కిడ్నాప్కు గురైతే అతడు ఢిల్లీకి ఎలా చేరాడని పోలీసులు విచారిస్తున్నారు.
తనను, తన కుటుంబ సభ్యులను నిషాంత్ కుటుంబం వేధింపులకు గురిచేస్తోందని రవి శంకర్ ఆరోపించారు. తన కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. నిషాంత్ అదృశ్యం వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More
Manipur Violence: మణిపూర్లో మళ్లీ హింస.. ఫైరింగ్లో 9 మంది మృతి