అహ్మదాబాద్ : (Ban on Lawyers) గుజరాత్ రాష్ట్రంలోని 9 వేలకు పైగా న్యాయవాదులను ప్రాక్టీస్ చేయకుండా వారిపై బార్ కౌన్సిల్ ఆఫ్ గుజరాత్ నిషేధం విధించింది. వీరి ఆదేశాల ప్రకారం గుజరాత్లోని 9,168 మంది న్యాయవాదులు రాష్ట్రంలోని ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేయలేరు. గుజరాత్ బార్ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధానికి గురైన న్యాయవాదుల జాబితాను రాష్ట్రంలోని అన్ని కోర్టులు, హైకోర్టు బార్ అసోసియేషన్కు పంపించారు. వీరు ఏదైనా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించినపక్షంలో వారిపై చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు కూడా ఉంటాయని రిజిస్ట్రేషన్ కమిటీ చైర్మన్ అనిల్ అకేలా హెచ్చరించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వీరిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
బార్ కౌన్సిల్ సాధారణ సమావేశానికి గుజరాత్ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు కిషోర్ త్రివేది, వైస్ప్రెసిడెంట్ కరణ్సింగ్ వాఘేలా, ఎల్డీసీ కమిటీ ఛైర్మన్ మనోజ్ అండక్ట్, బార్ కౌన్సిల్ ఆఫ్ గుజరాత్ సభ్యుడు దిలీప్ పటేల్, సభ్యుడు శంకర్ సింగ్ గోహిల్, దీపెన్ దవే, జీకే పటేల్, హీరాభాయ్ పటేల్, నళిన్ పటేల్, కిరణ్ బారోట్ తదితరులు హాజరయ్యారు.
2009 నుంచి 2021 వరకు బార్ కౌన్సిల్లో 39,445 మంది న్యాయవాదులు తమ పేర్లు నమోదు చేసుకోగా, 30,277 మంది మాత్రమే బీసీఐ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని కౌన్సిల్ తెలిపింది. న్యాయవాద కోర్సు చదివిన వారు ఎవరైనా కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి ఆల్ ఇండియా బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేని వారిని రాష్ట్రంలోని ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేయడానికి అనుమతించరు. ప్రస్తుతం నిషేధానికి గురైన వారికి రానున్న రెండేండ్లలో ఉత్తీర్ణత సాధించడానికి బీసీఐ ఆమోదం తెలిపింది.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం హిందూ మతం మారకండి : మోహన్ భగవత్
ఏడాదిన్నర బాబు.. 100 మంది పోలీసులు.. 65 సీసీటీవీలు.. 45 గ్రామాలు.. చివరకి ఏమైందంటే?
డ్రీమ్11 వ్యవస్థాపకులపై కేసు నమోదు.. కారణం ఏంటంటే..?
లోకనాయకుడు.. జయప్రకాశ్ నారాయణ్
ప్రపంచాన్ని అనుసంధానించడంలో స్పేస్ది కీలకపాత్ర : ప్రధాని మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..