(Dream 11) బెంగళూరు: ఫ్యాంటసీ గేమింగ్ జోనర్ డ్రీమ్ 11 సహా వ్యవస్థాపకులపై కర్ణాటకలో కేసు నమోదైంది. గేమింగ్ యాప్లపై నిషేధం విధించినప్పటికీ హర్ష్ జైన్, భవిత్ సేథ్ ఫాంటసీ యాప్ నడుపుతున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారు. బెంగళూరుకు చెందిన 42 ఏండ్ల క్యాబ్ డ్రైవర్ ఒకరు ఈ దావా వేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిద్దరికీ సమన్లు పంపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దాంతో కర్ణాటక రాష్ట్రంలో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు డ్రీమ్11 వెల్లడించింది.
కర్ణాటక రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్పై నిషేధం విధించారు. బెంగళూరులో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న మంజునాథ్.. డ్రీమ్11 యాప్ ప్రారంభించడాన్ని గుర్తించి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ కంపెనీ సీఈఓపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరినగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కర్ణాటక ప్రభుత్వ చట్టంపై తమ సలహాదారు అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని డ్రీమ్11 ప్రతినిధి ఒకరు తెలిపారు. చట్టపరమైన పరిమితుల్లోనే తాము బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని కూడా కంపెనీ సోషల్ మీడియాలో విడుదల చేసిన తన ప్రకటనలో పేర్కొన్నది.
డ్రీమ్ 11 కంపెనీని టైగర్ గ్లోబల్ కంపెనీ నిర్వహిస్తున్నది. కంపెనీ ఆదివారం సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని విడుదల చేసింది. ‘కర్ణాటక రాష్ట్రంలోని మా వినియోగదారులు తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా ఇటీవలి వార్తలను బట్టి తెలుస్తున్నది. మా కస్టమర్ల ఆందోళనను అర్థం చేసుకుని కర్ణాటకలో మా సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.
లోకనాయకుడు.. జయప్రకాశ్ నారాయణ్
ప్రపంచాన్ని అనుసంధానించడంలో స్పేస్ది కీలకపాత్ర : ప్రధాని మోదీ
నార్వేజియన్ సోలార్ ప్యానల్ కంపెనీతో 6 వేల కోట్ల రిలయన్స్ ఒప్పందం
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన టయోటా మిరై
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..