Mumbai Rains : మూడు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెగని వర్షాలతో ముంబై (Mumbai City) అష్ట దిగ్బంధనమైంది. మూడువైపులా నీరుండే నగరం నాలుగోవైపు సంబంధాలు తెగిపోవడంతో ద్వీపంలా మారింది. ముంబై-పుణె (Mumbai-Pune), ముంబై-అహ్మదాబాద్ (Mumabai-Amedabad), ముంబై-కొంకణ్ (Mumbai-Konkan) రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వే (Mumbai-Pune Express way) పై సోమవారం కొండచరియలు విరగపడ్డాయి. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వేలో ట్రాఫిక్ అంతరాయాలను తొలగించేందుకు ‘మిస్సింగ్ లింక్’ పేరుతో 13.3 కిలోమీటర్ల బైపాస్ను రూ.6,695 కోట్లతో నిర్మించారు. ఇందులో రెండు సొరంగాలు (1.6 కి.మీ., 8.9 కి.మీ.) ఉన్నాయి. ఈ సొరంగ మార్గాన్ని 9 వారాల కిందట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. సోమవారం 3.30 గంటల సమయంలో సొరంగం సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. విపత్తు నిర్వహణ సిబ్బంది ఏకంగా 18 గంటల పాటు శ్రమించి ఈ మార్గాన్ని పునరుద్ధరించారు. రుతుపవనాల ప్రభావంతో సోమవారం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.