చంఢీఘర్ : హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణం చేశారు. దత్తాత్రేయ చేత హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవి శంకర్ ఝా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు చీఫ్ జస్టిస్ రవి శంకర్, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శుభాకాంక్షలు తెలిపారు. 2019లో దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన విషయం తెలిసిందే. రెండేండ్ల అనంతరం దత్తాత్రేయను హర్యానా గవర్నర్గా కేంద్రం ఇటీవలే నియమించింది.