న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన హైస్పీడ్ వందే భారత్ రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా అందులో సర్వ్ చేసిన ఫుడ్పై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి వైజాగ్ నుంచి హైదరాబాద్కు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించాడు. బ్రేక్ఫాస్ట్ కోసం ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఐఆర్సీటీసీ అందించిన ఫుడ్ చూసి అతడు షాకయ్యాడు. ఆ వడలన్నీ ఆయిల్గా ఉన్నాయి. ఆ వ్యక్తి వాటిని పిండగా చాలా నూనె వచ్చింది.
కాగా, వందే భారత్ రైలులో ప్రయాణించిన కొందరు ఇది చూసి తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు. ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలులో ఆహారం ధర చాలా ఎక్కువ. నాణ్యత ఏమాత్రం బాగోలేదు’ అని విమర్శించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వందే భారత్ రైళ్లలో క్యాటరింగ్ నిర్వహించే ఐఆర్సీటీసీ దృష్టికి ఇది వెళ్లింది. దీంతో ఆ సంస్థ దీనిపై స్పందించింది. మళ్లీ ఇలా జరుగకుండా దిద్దుబాటు చర్యల కోసం సంబంధిత అధికారికి సమాచారం ఇచ్చినట్లు ఫిర్యాదు చేసిన వ్యక్తికి రిప్లై ఇచ్చింది.
Food price in Vande Bharat train ambitiously introduced by central government is very high, quality is very bad. pic.twitter.com/ttFM8pjiYx
— Pratap Kumar (@RK23666) February 4, 2023
Sir, concerned official has been informed for corrective measures.
— IRCTC (@IRCTCofficial) February 3, 2023