అయోధ్య (యూపీ): ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయం నిర్మాణానికి రూ.1,800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఆలయ ట్రస్ట్ అంచనావేసింది. ఆలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటైంది. ఫైజాబాద్లోని సర్క్యూట్ హౌస్లో సమావేశమైన 15 మంది సభ్యులున్న ఈ ట్రస్ట్.. ఆలయ నిర్మాణానికి సంబంధించిన అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. పలు నియమాలను, ఉపచట్టాలను ఖరారుచేసి ఆమోదం తెలిపింది. ఆలయ సముదాయంలో ప్రముఖ హిందూ ధర్మచార్యుల విగ్రహాలకు చోటుకల్పించాలని ట్రస్ట్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.