న్యూఢిల్లీ: ఢిల్లీలోని బాబర్ రోడ్డు (Babar Road) పేరును అయోధ్య మార్గ్గా మార్చారు హిందూ సేన కార్యకర్తలు. బాబార్ రోడ్డు అని సూచించే బోర్డులపై అయోధ్య మార్గ్ (Ayodhya Marg) అనే స్టిక్కర్లను అంటించారు. శనివారం ఉదయం వాటిని గుర్తించిన ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) అధికారులు వాటిని తొలగించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేశారు.
కాగా, బాబర్ రోడ్డు పేరును మార్చాలని హిందూ సేన గత కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నది. 2019లో సూచిక బోర్డులపై హిందూ సేన కార్యకర్తుల నలుపురంగు పూశారు. మరో రెండు రోజుల్లో ఆయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, రాముల వారి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆ పేరును మార్చడం గమనార్హం.
#WATCH | Sticker of ‘Ayodhya Marg’ put up by Hindu Sena activists on Babar Road in Delhi has now been removed. pic.twitter.com/Y7eKCHd7Ar
— ANI (@ANI) January 20, 2024