లక్నో: ‘రాముడు లేకుండా అయోధ్య లేదు. అయోధ్య కాదు. రాముడు ఇక్కడే పుట్టాడు. రాముడు ఇక్కడే శాశ్వతంగా నివసించాడు. రాముడితోనే అయోధ్య కలిసి ఉన్నది’ అని భారతదేశం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం అయోధ్యలో రామ్నాథ్ కోవింద్ (Ramnath Kovind) పర్యటించారు. రామ మందిరం నిర్మాణం పనులను సందర్శించారు. అనంతరం అయోధ్య పట్టణంలో నిర్వహించిన రామాయణ సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
తన పేరును ప్రస్తావిస్తూ.. ‘నా కుటుంబ సభ్యులు నాకు పేరు పెట్టినప్పుడు, సాధారణ ప్రజల్లో కనిపించే రాముడి కథ, రాముడు పట్ల గౌరవం, ఆప్యాయతను వారు కలిగి ఉన్నారని నేను భావిస్తున్నాను’ అని చెప్పారు. ఆదివాసీల పట్ల రాముడికి ఉన్న ప్రేమను ఎత్తి చూపుతూ… అజ్ఞాతవాస కాలంలో రాముడు యుద్ధం చేయడానికి అయోధ్య, మిథిలా సైన్యాలను పిలువలేదని చెప్పారు. ఆయన కోల్స్, భీల్స్, వానర్లను సేకరించి తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, చివరకు జటాయువును కూడా తన సైన్యంలో చేర్చుకున్నాడని అన్నారు. ఇది రాముడికి గిరిజనులతో ఉన్న ప్రేమ, స్నేహాన్ని వ్యక్తపరుస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా రామాయణ సమ్మేళనానికి సంబంధించిన పోస్టల్ కవర్ను రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, కేంద్ర సహాయ మంత్రి దర్శన్ విక్రమ్ జర్దోష్ తదితరులు పాల్గొన్నారు. 2019 లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పు అనంతరం, రామ జన్మభూమి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
నాలుగు కాళ్ల తిమింగలం దొరికిందోచ్..!
అంతర్జాతీయ విమానాలపై సస్పెన్షన్ పొడగింపు
తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
సముద్రం నుంచి అంతరిక్షంలోకి తొలి ఫోన్ కాల్
సబ్ ఖేలే.. సబ్ ఖిలే.. మన్ కీ బాత్లో మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..