న్యూఢిల్లీ: భూకంపాల్లో ఉత్పన్నమైన తరంగాలను అధ్యయనం చేసిన ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు భూమికి చాలా లోపల ఐదో పొర ఉందని విశ్వసిస్తున్నారు. గత దశాబ్దంలో మాగ్నిట్యూడ్-6 కంటే ఎక్కువ శక్తి వెలువడిన 200 భూకంపాలను అధ్యయనం చేశాక వారు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ అయిదో పొర భూమికి చాలా లోపల ఘన రూపంలోని లోహపు బంతిలా ఉంటుందని భావిస్తున్నారు. ఈ అధ్యయన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. భూమి ఆవిర్భావం, పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి భూమి మధ్య భాగం ఎంతో కీలకమైనదని పరిశోధకులు భావిస్తున్నారు.