Attack on Owaisi Car: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో వివరణ ఇవ్వనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన తోటి సభ్యులకు వెల్లడించనున్నారు. ఈ నెల 7న (వచ్చే సోమవారం) మంత్రి అమిత్ షా.. ఒవైసీ కారుపై కాల్పుల ఘటనకు సంబంధించి పార్లమెంటులో వివరణ ఇస్తారని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఒవైసీ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే, ఈ కాల్పుల నుంచి ఒవైసీ ఏ అపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఘటన నేపథ్యంలో ఒవైసీకి జడ్-క్యాటగిరీ భద్రత కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే తనకు జడ్ క్యాటగిరీ భద్రత అక్కర్లేదని ఒవైసీ తిరస్కరించారు. ఇవాళ్ లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. తాను చావుకు భయపడనని, తనకు జడ్-క్యాటగిరీ సెక్యూరిటీ అక్కర్లేదని చెప్పారు.