షిల్లాంగ్, ఫిబ్రవరి 26: ఈశాన్య రాష్ర్టాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఈ రెండు రాష్ర్టాల ఎన్నికలు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ర్టాల్లోనూ ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
చాలా నియోజకవర్గాలు కొండ ప్రాంతాల్లో ఉండటంతో, అక్కడ ఉన్న పోలింగ్ కేంద్రాలకు చేరడానికి శనివారమే సిబ్బంది బయలుదేరి వెళ్లారు. మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా సోహియాంగ్లో నియోజకవర్గ యూడీపీ అభ్యర్థి మరణంతో 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాగాలాండ్లో ఎన్నికల నేపథ్యంలో భారత్-మయన్మార్ సరిహద్దు వెంబడి నిఘాను కట్టుదిట్టం చేశారు.