న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లోనూ (ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7) పోలింగ్ జరుగనుండగా.. ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్లో రెండో దశలో ఒకేరోజు (ఫిబ్రవరి 14న) పోలింగ్ ముగియనుంది. ఇక మణిపూర్లో ఐదు, ఆరో దశల్లో అంటే మొత్తం రెండు దశల్లో (ఫిబ్రవరి 27న, మార్చి 3న) పోలింగ్ జరుగనుంది.
అంటే ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఈ ఏడు దశల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. మార్చి 10న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక మొదటి దశ ఎన్నికల కోసం ఈ నెల 14న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్లకు తుది గడువు జనవరి 21. జనవరి 24న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. జనవరి 27 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఇక రెండో దశ పోలింగ్ కోసం జనవరి 21న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు జనవరి 28. జనవరి 29న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. జనవరి 31 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం.
ఇక మూడో దశ పోలింగ్ కోసం జనవరి 25న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 1. ఫిబ్రవరి 2న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఫిబ్రవరి 4 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం. నాలుగో దశ పోలింగ్ కోసం జనవరి 27న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 3. ఫిబ్రవరి 4న నామినేషన్ల స్క్రూటినీ. ఫిబ్రవరి 7 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఐదో దశ పోలింగ్ కోసం ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 8. ఫిబ్రవరి 9న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఫిబ్రవరి 11 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం.
ఆరో దశ పోలింగ్ కోసం ఫిబ్రవరి 4న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 11. ఫిబ్రవరి 14న నామినేషన్ల స్క్రూటినీ. ఫిబ్రవరి 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం. ఏడో దశ పోలింగ్ కోసం ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 17 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 18న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నది.