Assam Rifles | ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ భారీగా జరుగుతున్నది. గత నాలుగేళ్లలో దాదాపు రూ.2400కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అసోం రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నది. జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ పీసీ నాయర్ మాట్లాడుతూ.. సరిహద్దులతో కాపాడడంతో పాటు డగ్స్, అక్రమ ఆయుధాల రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నాలుగేళ్లలో రూ.4267 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 2020లో రూ.875కోట్ల విలువైన అక్రమ రవాణా చేస్తున్న డ్రగ్స్ను పట్టుకున్నామన్నారు.
2021లో రూ.1402కోట్లు, 2022లో రూ.855కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మయన్మార్లో యుద్ధం నేపథ్యంలో రెండు సంవత్సరాల్లో తగ్గుదల నమోదైందని పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1135 కోట్ల విలువైన అక్రమ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అసోం రైఫిల్స్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేశామని ఇందులో థర్మల్ ఇమేజర్లు, నైట్ విజన్ పరికరాలు, బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లు, డ్రోన్లు, యాంటీ మైన్ వెహికల్స్ పలు అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసినట్లు పేర్కొంది.