గువహటి : అసోంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం మదర్సాల పేరును మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్గా (Assam Renames Madrasas) మార్చింది. రాష్ట్రంలోని 1281 మదర్సాలను ఇక మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్గా వ్యవహరిస్తామని అసోం విద్యా శాఖ మంత్రి రణోజ్ పెగు ప్రకటించారు. అసోం విద్యా వ్యవస్ధలో ఏకరూపతను తీసుకువచ్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పెగు పేర్కొన్నారు.
సెబా (స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ అస్సాం) పరిధిలోకి అన్ని మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చినట్టు, ఈ దిశగా 1281 మదర్సాలను ఎంఈ స్కూల్స్గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశామని విద్యా శాఖ మంత్రి ట్విట్టర్ వేదికగ వెల్లడించారు.
ప్రభుత్వ మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చే ప్రక్రియను అసోం డైరెక్టరేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పర్యవేక్షించింది. మదర్సాలను నిర్వహించేందుకు రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు అసోం ప్రభుత్వం గతంలో వెల్లడించింది.
Read More :
Bigg Boss S7 | ‘బిగ్బాస్’ ఫైనల్కు గెస్టులుగా రానున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.?