గువాహటి: అసోంను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. శనివారం కురిసిన వర్షాలతో వరదలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో 8 మంది మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 25కు చేరింది.
హోజాయ్, బజాలి, కబ్రీ అంగ్లాండ్ వెస్ట్, కాక్రఝర్, తముల్పూర్ జిల్లాలో వరదల తీవ్రత అధికంగా ఉంది. వరదల ధాటికి హోజాయ్ జిల్లాలో నలుగురు గల్లంతయ్యారు. మొత్తంగా రాష్ట్రంలో ఈ ఏడాది వరదలు, కొండచరలియలు విరిగిపడి 62 మంది మరణించారని అధికారులు తెలిపారు.
కాగా, రాష్ట్రంలోని 32 జిల్లాలోని 31 లక్షల మందిని ప్రభావితం చేశాని చెప్పారు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఉప్పొంగడంతో మొత్తం 4,291 గ్రామాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. దీంతో 66455.82 హెక్టార్ల మేర పంట నీట మునిగిందని వెల్లడించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.
ఛిరంగ్ జిల్లాలోనే వందకు పైగా గ్రామాలకు చెందిన ప్రజలను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయని తెలిపారు. వందలాది మంది పునరాసవాస కేంద్రాలకు తరలివెళ్తున్నారు.
#WATCH Locals wade through flood water in the Kampur area of central Assam’s Nagaon district pic.twitter.com/tdX1C5nzS4
— ANI (@ANI) June 19, 2022
#WATCH Flood situation in Assam’s Chirang district remains grim with thousands of people affected
SDRF teams rescue more than 100 villagers. All the trapped people were shifted to safe places. (18.06) pic.twitter.com/IzQeAVJ0H2
— ANI (@ANI) June 19, 2022