బెళగావి, మార్చి 17: అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఇప్పటికే 600 మదర్సాలను మూసివేశామని, త్వరలో ఇతర మదర్సాలను కూడా మూసివేస్తామని పేర్కొన్నారు. కర్ణాటక పర్యటనలో గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న హిమంత మాట్లాడుతూ ఆధునిక భారత్లో మదర్సాల అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వ్యక్తులు, కమ్యూనిస్టులు చరిత్రను వక్రీకరించారని, వాస్తవాలను తప్పుగా చూపారని ఆరోపించారు. కాంగ్రెస్ను ‘ఆధునిక మొఘల్స్’గా అభివర్ణించారు. వక్రీకరించిన చరిత్రను కొత్త మార్గంలో తిరగరాయాల్సిన సమయం వచ్చిందని అన్నారు.