న్యూఢిల్లీ : ఫారెక్స్ ఉల్లంఘన కేసులో కాంగ్రెస్ నేత, రాజస్ధాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ నివాసం సహా సంబంధిత ప్రదేశాల్లో ఈడీ అధికారులు (Enforcement Directorate) బుధవారం దాడులు చేపట్టారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాజస్ధాన్కు చెందిన ఆతిధ్య కంపెనీ ట్రైటన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ డైరెక్టర్లు, ప్రమోటర్లు శివ శంకర్ శర్మ, రతన కాంత్ శర్మ ఇతరులపై నమోదైన కేసు విచారణలో భాగంగా ఏఐసీసీ సభ్యుడు వైభవ్ గెహ్లాత్పై ఈడీ చర్యలకు దిగింది.
కార్ రెంటల్ సర్వీస్లో రతన్ కాంత్ శర్మ కార్ రెంటల్ సర్వీస్లో వైభవ్ గెహ్లాత్ బిజినెస్ పార్టనర్గా ఉన్నారు. 2015లో ఇద్దరు జైపూర్ స్ధానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారిషస్కు చెందిన శివ్నార్ హోల్డింగ్స అనే షెల్ కంపెనీ ద్వారా వైభవ్ గెహ్లాట్ ట్రైటన్ హోటల్స్కు నిధులు దారి మళ్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
హోటల్కు చెందిన రూ. 100 విలువైన షేర్ను షేర్కు రూ. 39,900 చెల్లించి 2500 షేర్లు కొనుగోలు చేయడం ద్వారా ట్రైటన్ హోటల్స్కు దారి మళ్లించారు. ట్రైటన్ గ్రూప్ పలు దేశాలతో ప్రమేయమున్న హవాలా లావాదేవీల్లో చురుకైన పాత్ర నిర్వహించిందని తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ పేర్కొంది.
Read More :
Dawood Ibrahim | వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు..!